బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఫైనల్ వీక్ కి వచ్చేసింది.డిస్నీ+ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు ఫైనల్ వీక్ లో ఐదుగురు కంటెస్టంట్స్ టాప్ 5లో ఉంటున్నారు.
వారిలో ఎవరు టైటిల్ గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే టైటిల్ రేసులో ఉన్న ఇద్దరు టాప్ కంటెస్టంట్స్ ని ఆడియెన్స్ ఫిక్స్ చేశారు.
అయితే వారిలో ఒకరికి మాత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి కూడా మంచి సపోర్ట్ వస్తుంది.ఇంతకీ ఆమె ఎవరు అంటే బిందు మాధవి అని తెలుస్తుంది.
ఇప్పటికే ఒకరిద్దరు స్టార్స్ బిందుకి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తుండగా లేటెస్ట్ గా ఫైనల్ వీక్ లో క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బిందు మాధవికి సపోర్ట్ గా మెసేజ్ చేసింది.నువ్వు టైటిల్ విజేత అవడానికి అర్హురాలివి అంటూ తన ఇన్ స్టాగ్రాం లో స్టేటస్ పెట్టింది పాయల్ రాజ్ పుత్.
సో దీన్నిబట్టి చూస్తుంటే పాయల్ రాజ్ పుత్ కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుందని అర్ధమవుతుంది.ఇప్పటికే ఎక్కువ శాతం బిందు మాధవి విజేత అని ఫిక్స్ అయ్యారు.
అయితే ఫైనల్ వీక్ ఓటింగ్ లో ఏదైనా జరగొచ్చు.మరి ఆమె టైటిల్ విన్నర్ అవుతుందా లేదా అన్నది చూడాలి.