హరిహర వీరమల్లు నుండి రాబోతున్న అప్డేట్ ఏంటి..!

పవన్ కళ్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ సగం పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్‌ భీమ్లా నాయక్‌ సినిమా షూటింగ్ ను ముగించిన వెంటనే హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ లో పాల్గొనబోతున్నట్లుగా చెబుతున్నారు.

వారం రోజుల్లోనే భీమ్లా నాయక్‌ సినిమా షూటింగ్‌ ను ముగించబోతున్నట్లుగా చెబుతున్నారు.ఇదే సమయంలో క్రిష్ షూటింగ్‌ ను కంటిన్యూ చేస్తున్నాడట.

పవన్ కళ్యాణ్‌ కాంబో లేని సన్నివేశాలను చిత్రీకరించి పెట్టి పవన్‌ వచ్చిన వెంటనే చకచక షూటింగ్‌ ను ముగించేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రికార్డు స్థాయిలో ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు సాదారణంగానే కాస్త ఎక్కువ బడ్జెట్‌ తో రూపొందుతాయి.అయితే ఈసారి ఏకంగా 150 కోట్ల బడ్జెట్‌ ను ఈ సినిమా కు కేటాయించారనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హరి హర వీరమల్లు సినిమా బడ్జెట్‌ లో దాదాపుగా 50 కోట్లు గ్రాఫిక్స్ వర్క్ కు ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కనుక ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్ డేట్‌ కూడా అంచనాలను ఆకాశానికి పెంచుతుంది అనడంలో సందేహం లేదు.

హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ను దాదాపుగా ఆరు ఏడు నెలల తర్వాత పునః ప్రారంభించబోతున్నట్లుగా వారం పది రోజుల్లో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారికంగా ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ విషయమై అతి త్వరలోనే క్లారిటీ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.ఈ సినిమా లో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ నటించబోతున్నట్లుగా చెబుతున్నారు.

తాజా వార్తలు