మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు అయింది.ఈ మేరకు భాస్కర్ రెడ్డికి నవంబర్ 1వ తేదీ వరకు బెయిల్ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనారోగ్యం వలన బెయిల్ పొడిగించాలని కోరుతూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్కార్ట్ బెయిల్ ను పొడిగించింది.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.







