వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మ ఛాయ తగ్గిపోతుంటుంది.మండే ఎండలు, అధిక వేడి ఇందుకు ప్రధాన కారణాలు.
ఏదేమైనా తెల్లగా నిగనిగలాడాల్సిన చర్మం నల్లగా మారిపోతే ఎవ్వరికైనా ఎంతో బాధ కలుగుతుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని తరచూ పాటిస్తే గనుక వేసవిలో స్కిన్ టోన్ను ఏమాత్రం తగ్గకుండా కాపాడుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కప్పు పుచ్చకాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్ను మాత్రం సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బార్లీ గింజల పౌడర్, చిటికెడు కస్తూరి పసుపు, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం మరియు మొదట తయారు చేసి పెట్టుకున్న పచ్చకాయ రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలీ అనుకుంటే చేతులకు కూడా పట్టించి.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం కూల్ వాటర్తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే గనుక చర్మ ఛాయ తగ్గకుండా ఉంటుంది.మరియు స్కిన్ మరింత బ్రైట్గా, గ్లోగా మారుతుంది.
అంతే కాదు, పైన చెప్పిన సింపుల్ అండ్ సూపర్ హోమ్ రెమెడీని సమ్మర్ సీజన్లో తరచూ ట్రై చేయడం వల్ల చర్మం ఆయిలీ ఆయిలీగా మారకుండా ఉంటుంది.మొటిమలు, ఏమైనా మచ్చలు ఉన్నా తగ్గు ముఖం పడతాయి.
మరియు చర్మంపై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ సైతం తొలగిపోతాయి.