మోడీని పల్లెత్తు మాట అనడానికి సంకోచించే ప్రతిపక్ష నాయకులు మధ్యన డి అంటే డి అంటూమోడి తో తలపడే నేతగా కేసీఆర్ కు మంచి పేరుంది విమర్శలను కూడా మనసులోకి చొచ్చుకుపోయేటట్టుగా అవతలి వారు తిరిగి సమాధానం చెప్పలేనంత గొప్పగా ఉపయోగించ గల భాషానైపుణ్యం కేసిఆర్ సొంతం.స్వతహాగా రచయిత అయిన కేసీఆర్ తన భాష నైపుణ్యాన్ని తన రాజకీయ ఎదుగుదలకు సోపానం గా అత్యంత నైపుణ్యం గా ఉపయోగించుకుంటారు….
మరి కడుపున పుట్టిన వారసులకు ఆ నైపుణ్యం రాకుండా ఉంటుందా? ఉండదు.అందుకే కేటీఆర్ కూడా తనదైన శైలిలో ప్రత్యర్ధులకు పంచులు విసురుతుంటారు .ప్రధానమంత్రిని భాజాపా ప్రభుత్వాన్ని విమర్శించడంలో కెసిఆర్ తర్వాత ఆ స్థాయి వాక్ చతురత కేటీఆర్ కి మాత్రమే ఉందనడం అతిశయోక్తి కాదు.ఇటీవల జరిగిన తొర్రూరు సభలో తన వాగ్బాణాలతో భాజపా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడా రని చెప్పొచు .వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ టాక్స్ లాగా ఈమధ్య ప్రధాన మంత్రి వన్ నేషన్ వన్ వన్ దోస్త్ పాలసీని కూడా తీసుకొచ్చారని, అందిన కాడికి స్నేహితుడికి దోచిపెట్టడమే ఈ పాలసీ ఉద్దేశమని, ఆ డబ్బుల్ని ప్రతిపక్ష ప్రభుత్వాలని పడగొట్టడానికి, ఎమ్మెల్యే లను ,ఎంపీలను కొనడానికి ఉపయోగిస్తారు అని ఆయన విమర్శించారు.

మతాల మద్య చిచ్చు పెట్టడం ,విద్వేష భావనలను రెచ్చగొట్టడం తప్ప బీజేపీకి మరేమీ తెలియదని, అభివృద్ధి అంటే కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని, మనసులు గెలుచుకునే విధంగా కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ లాంటి నాయకుడిని కాపాడుకోవలసిన అవసరం ప్రజలందరికీ ఉందని ఆయన తెలిపారు రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్షాలను విమర్శించడం మామూలే అయినప్పటికీ జన రజకంగా మనసులు తాకే విధంగా మాట్లాడడంలోనూ భాషను ఉపయోగించడం లోనూ కేసీఆర్ స్థాయిని కేటీఆర్ నిలబెట్టారని చెప్పాలి.జయాపపజయాలను విమర్శ ప్రతి విమర్శలను పక్కనపెట్టి చూస్తే భాషా నైపుణ్యం, సమర్థత కలిగిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కల్వకుంట్ల తారక రామారావు కూడా ఒకరిని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు .