టీడీపీ ఎమ్మెల్యే, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో బాలయ్య మాట్లాడుతూ తెనాలి పెమ్మసాని థియేటర్ లో 365 రోజుల పాటు సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను రోజుకొక సినిమా చొప్పున ప్రదర్శితం చేయనున్నామని వెల్లడించారు.
ఉచితంగా ఈ సినిమాలను ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు.
తాను దైవంగా భావించే మహానుభావుడికి శతజయంతి వందనాలని బాలయ్య అన్నారు.
తెలుగువారికి ఏ కష్టం వచ్చినా సాయం చేసే విషయంలో నాన్న ముందుండేవారని ఆయన చెప్పుకొచ్చారు.రాయలసీమ ప్రజల కోసం జోలి పట్టిన సంఘసంస్కర్త తన తండ్రి అని బాలయ్య కామెంట్లు చేశారు.
బడుగు, బలహీన శ్రామిక వర్గాల కోసం నాన్న రాజకీయాల్లోకి వచ్చారని బాలయ్య వెల్లడించారు.నాన్న పేరు చెప్పిన వెంటనే ఆయన చేపట్టిన ఎన్నో సంస్కరణలు గుర్తుకు వస్తాయని బాలయ్య తెలిపారు.
ఆ తర్వాత జగన్ సర్కార్ ను ఉద్దేశించి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని ఒక్క ఛాన్స్ అంటే తప్పిదం చేశారని ఓటు వేశారు అనుభవిస్తున్నారని బాలయ్య వెల్లడించారు.
గురజాడ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అన్నారని ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.జగన్ సర్కార్ గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం అని బాలయ్య తెలిపారు.
ఎన్నుకునే ప్రభుత్వం విషయంలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బాలయ్య సూచనలు చేశారు.బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాలయ్య చేసిన కామెంట్ల గురించి వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.బాలయ్య కామెంట్ల గురించి ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది
.