టెర్రర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు ప్రియదర్శి( Priyadarshi ) .మల్లేశం సినిమా ద్వారా హీరోగా సందడి చేసినటువంటి అనంతరం ఎన్నో సినిమాలలో కమెడియన్ గా కీలక పాత్రలలో నటించారు.
ఇలా పలు సినిమాలలో కమెడియన్ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియదర్శి తాజాగా బలగం ( Balagam ) సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయన ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియదర్శి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటుడు ప్రియదర్శి తన కిడ్నీలు ( Kidney ) అమ్ముకున్నారనే ఓ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.ఇలా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.ప్రియదర్శి ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షర్టు లేకుండా తన బాడీ కనిపించేటట్లు ఉండే ఒక ఫోటోని షేర్ చేశారు.ఇలా ఈయన చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై విబిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రియదర్శి షేర్ చేసిన ఆ ఫోటోని నిశితంగా గమనించిన ప్రేక్షకులు ఓ విషయం గురించి ట్రోల్ చేస్తున్నారు.ఇక ఆ ఫోటోలో ఏముందంటే.ప్రియదర్శి (Priyadarshi) బాడీ పై ఒక గాయం కనిపిస్తోంది.అయితే ఆ గాయాన్ని చూసిన కొందరు నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఏదైనా సినిమా షూటింగ్లో భాగంగా ఇలా నటిస్తున్నారా లేకపోతే ఏదైనా గాయం తగిలిందా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఏంటన్న డబ్బులు లేకపోవడంతో రెండు కిడ్నీలు అమ్ముకున్నావా ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.ఏది ఏమైనా ప్రియదర్శి షేర్ చేసిన ఈ ఫోటో కారణంగా ఆయన కిడ్నీలు అమ్ముకున్నారంటూ వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.