తల్లి కావడం అనేది ఓ మధురానుభూతి.చాలా మంది మహిళలు ఆ క్షణాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు.
ఒకే కాన్పులో ఒక్కరు పుడితేనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతారు.అలాంటి ఒకే సారి ఇద్దరు శిశువులు జన్మించడం అంటే ఆనందం డబుల్ అయినట్టే.
కానీ గోవాలోని ఎత్మాద్దౌలా ప్రాంతంలోని ప్రకాష్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ మనోజ్ భార్య ఖుష్భూ గర్భవతి.ప్రసవం కోసం ట్రాన్స్ యమునా కాలనీ ఫేడజ్-1 లోని అంబే ఆసుపత్రిలో చేరారు.
ప్రసవానికి ముందు వైద్యులు ఆమెకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు.అందులో కవలలు ఉన్నట్లు తెలిసింది.
అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు.ఆనందంతో వేచి చూస్తున్న వారికి ఆశ్చర్యకమైన వార్త తెలిసింది.
శస్త్ర చికిత్స చేస్తున్న క్రమంలో కడుపులో నలుగురు శిశువులు కనిపించారు.దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.అయితే ఖుష్బూ జన్మనిచ్చిన నలుగురు పిల్లల్లో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు డబుల్ బొనాంజా దొరికినంత హ్యాపీగా ఫీలయ్యారు.
ఒకే కాన్పులు నలుగురు పిల్లలు పుట్టడం చాలా సంతోషంగా ఉందని… ఇద్దరు మాత్రమే పుడతారనుకున్న క్రమంలో నలుగురు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని వారు వివరించారు.ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే ఒకే కాన్పులు నలుగురు పిల్లలు పుట్టడం ఇదే మొదటి సారి ఏం కాదు.