తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.జనవరి 1న అర్ధరాత్రి 1.30 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనాలను టీటీడీ కల్పించనుంది.మొదట ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

 Arrangements For Vaikuntha Ekadashi Celebrations In Tirumala-TeluguStop.com

ఉదయం 5 గంటల నుంచి సామాన్య భక్తుల సర్వదర్శనం ప్రారంభంకానుంది.ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా రోజుకు 25 వేల ప్రత్యేక దర్శనం టికెట్లను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.

రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించనుంది.ఇందులో భాగంగా రోజుకు 50 వేల టోకెన్ల చొప్పున 10 రోజులకు 5 లక్షల టోకెన్లను జారీ చేయనున్నారు.

ఈ మేరకు 24 గంటలూ కౌంటర్స్ తెరిచి ఉంటాయని టీటీడీ వెల్లడించింది.ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube