మునుగోడు ఉపఎన్నికకు ముమ్మరంగా ఏర్పాట్లు..

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఏర్పాట్లు జోరందుకున్నాయి.దీనిలో భాగంగా పోలింగ్ సామాగ్రిని ఇవాళ అధికారులు పంపిణీ చేయనున్నారు.

 Arrangements Are Being Made For The By-election.-TeluguStop.com

సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

అదేవిధంగా మునుగోడులో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయగా, మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.కాగా ఈ ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.

బైపోల్ విధుల్లో 1192 మంది సిబ్బంది పాల్గొననున్నారు.ఇప్పటికే రెండుసార్లు పోలింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు.

అటు భద్రతా విధుల్లో సుమారు ఐదు వేల మంది పోలీసులు పాల్గొనున్నారు.రేపు పోలింగ్ జరగనుండగా.

ఆదివారం ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube