తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు మాటలను కోడ్ చేస్తూ ఏపీని కేసీఆర్ కించపరుస్తున్నారని తెలిపారు.
ఎవరి కోసం ఏపీ గురించి ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.అచ్యుతాపురంలో ఎకరం అమ్మితే తెలంగాణలో 120 ఎకరాలు కొనవచ్చని చెప్పారు.
ఇక విశాఖ, విజయవాడ, కాకినాడలో భూముల విలువ చెప్పనవసరం లేదన్నారు.హైదరాబాద్ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం తమ ప్రాంతాన్ని కించపరచకండని తెలిపారు.