ఏపీ మీద దయతలచిన కేంద్రం

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దయతలచింది.వానలతో , వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1030 కోట్లు విడుదల చేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల కిందట లేఖ రాస్తే ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది.

 Ap Gets Rs. 1 030 Crore For Flood Relief From Centre-TeluguStop.com

ఏపీ కంటే ముందు తమిళనాడుకు సాయం చేసింది.దీంతో కేంద్రం పై అనేక విమర్శలు వచ్చాయి.

రెండు రాష్ట్రాలు ఒకే సమయంలో వరదలతో అపార నష్టానికి గురైనప్పటికీ ముందుగా తమిళనాడుకే సాయం చేసింది.బాబు వెంటనే సాయం కోసం లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదు.

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.ఆ సమావేశాల్లో మిత్ర పక్షమైన టీడీపీ సాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తే పరువు పోతుందనే భయంతో ఈ సాయం చేసి ఉండొచ్చు.

బాబు వెయ్యి కోట్ల సాయం అడిగితే కాస్త ఎక్కువగానే ఇచ్చారు.మంత్రి వెంకయ్య నాయుడు గట్టిగా కృషి చేసి ఉండొచ్చు.

ఆయన సొంత జిల్లా నెల్లూరు బాగా దెబ్బ తిన్నది.ఏది ఏమైనా సాయం చేయడం సంతోషం.

ఇది తక్షణ సాయం మాత్రమే.నష్టంపై నివేదిక పంపాక మరింత సహాయం చెయ్యాలి.

మరి కేంద్రం ఇంతటితో సరిపెడుతుందా? మళ్ళీ సాయం చేస్తుందా? చూడాలి.AP gets Rs.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube