ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే తన నవరత్నాలని అమలు చేయడం మొదలు పెట్టి మొదటి సంతకం వృద్ధాప్య పించన్ పెంపు మీద పెట్టాడు.
అనంతరం కీలక బిల్లులతో ఐఎఎస్, ఐపీఎస్ ల బదిలీ చేసేసాడు.ఇక తాజాగా రైతుల కోసం రైతు భరోసాని అందుబాటులో తీసుకొచ్చాడు.
ఇలా వరుసగా తన పథకాలని అమలు చేస్తూ పరిపాలనలో తన మార్క్ చూపిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు తన మంత్రి వర్గంపై జగన్ ప్రత్యేక ద్రుష్టి పెట్టాడు.
మంత్రి వర్గ ఏర్పాటుపై ఇప్పటి పని పూర్తి చేసిన జగన్ కీలక పదవులలో ఎవరెవరు ఉండాలి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఇక పార్టీలో ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ముఖ్యమంత్రి జగన్ కేటాయించినట్లు తెలుస్తుంది.
రెడ్డి సామాజికవర్గం నుంచి ఏడుగురికి అవకాశం అలాగే బీసీ నుంచి 6 గురుకి, కాపులో ఇద్దరికి, కమ్మ నుంచి ఇద్దరికి, మాల నుంచి ఇద్దరికి, మాదిగ నుంచి ఒకరికి, గిరిజన ఎస్టీ నుంచి ఒకరికి అలాగే క్షత్రియ, ముస్లిం మైనార్టీ బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్లో చాన్స్ కల్పించినట్లు తెలుస్తోంది.సీనియర్లను, జూనియర్లను కలుపుతూ కేబినెట్ను రెడీ చేస్తున్నారు సీఎం జగన్.
క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలకు మంత్రిపదవుల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది.