సీబీఐ కోర్టుకు హాజరైన జగన్

అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ ఈ రోజు విచారణ నిమిత్తం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ తో పాటు హాజరయ్యారు.

 Ap Cm Jagan Attends Nampally Cbi Court-TeluguStop.com

అయితే ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా ఆయన సిబిఐ కోర్టుకు హాజరవ్వడం విశేషం.ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ అక్కడ నుంచి నేరుగా కోర్టుకు చేరుకున్నారు.

పాలనా కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్న కారణంగా కోర్టు విచారణ నుంచి వ్యక్తిగతంగా తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఆయనకు కోర్టు హయారు నుంచి మినహాయింపు ఇచ్చింది.అయితే ఈ రోజు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జగన్ సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు.

అయితే ఈ కేసులో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా సురేఖ కొండా మురళిలను చేర్చారు.అక్రమాస్తుల కేసులో జగన్ పై 11 చార్జిషీట్లు సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ప్రతీ కేసులోనూ జగన్ ఏ 1 , విజయ్ సాయి రెడ్డి ఏ 2 నిందితులుగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube