పవన్ కళ్యాణ్
విజయనగరం లో బిజెపి కార్యకర్తలు నుంచి వైసిపి దాడి ప్రారంభమైంది.ప్రతిపక్ష పార్టీలు నేతల పై దాడులతో భయ పెడుతున్నారు.
జనసేన నాయకులపై అన్యాయం గా కేసులు పెట్టారు.నిన్న ఘటన పూర్తిగా ప్రభుత్వం కుట్రగా భావిస్తున్నాం.
నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బిజెపి నాయకులకు ధన్యవాదాలు.సన్నాసులు ఏదో వాగుతారు… వారి మాటలను పట్టించుకో నవసరం లేదు .
సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ యాత్ర ను అడ్డుకోవడం ప్రజా స్వామ్యంలో ఆందోళన కలిగించే అంశం.జనసేనాధిపతి గా అనేక కార్యక్రమాలు, పర్యటన లు చేపట్టారు.
వైసిపి వారు వారికి వారిగా ఒక ఉద్యమం చేస్తున్నారు.వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేన పై కుట్ర చేశారు.
ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించాం.
వారు కూడా వైసిపి ప్రభుత్వం దుశ్చర్యలు పై పోరాడాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యలపై పోరు సాగిస్తాం.
విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాం.జన స్పందన లేక పోవడంతో కుట్ర కు తెర లేపారు.
ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతాం.