1.ఢిల్లీలో భూకంపం
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు భూకంపం సంబంధించింది.రిక్టార్ స్కేల్ పై 4.8 గా తీవ్రత నమోదయ్యింది
2.జగన్ పై నారాయణ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ పై సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు.ఏపీ సీఎం జగన్ పరమ దుర్మార్గుడని, ఏపీలో జరుగుతున్న పరిణామాలను తాను ఖండిస్తున్నాను అని తెలిపారు
3.తిరుమల సమాచారం
తిరుమల లో శ్రీవాణి టిక్కెట్ల కరెంట్ బుకింగ్ ను టీటీడీ పునః ప్రారంభించింది
4.ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎం ఎల్ సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చి బాబు ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది
5.పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాల్సిందే : హైకోర్ట్
ఉరవకొండ ఎమ్మెల్యే , పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది
6.IIPS లో పీజీ , పీహెచ్ డీ ప్రవేశాలు
ముంబై లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ వివిధ ప్రోగ్రాములలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
7.రాష్ట్ర విభజన పై సుప్రీం లో విచారణ వాయిదా
రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టు లో దాఖలైన పిటిషన్ లపై విచారణ వాయిదా పడింది
8.ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
టిడిపి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.రాష్ట్రంలో పోలీసు రాజ్యం , అరాచక పాలన నడుస్తుందని, త్వరలోనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని రాయపాటి అన్నారు
9.గన్నవరం కోర్టుకు పట్టాభి
టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు
10.కేటీఆర్ పై రేవంత్ కామెంట్స్
వీధి కుక్కల దాడిలో మనుషులు చనిపోతే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తారా అంటూ కేటీఆర్ పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు
11.నటుడు ప్రభు కి తీవ్ర అస్వస్థత
ప్రముఖ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థత కు గురయ్యారు.వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని కొడంబక్కంలోని మెడ్వే ఆసుపత్రికి తరలించారు
12.గవర్నర్ కు వీడ్కోలు
గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ప్రభుత్వం వీడ్కోలు పలికింది
13.నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ను టీటీడీ విడుదల చేయనుంది.మార్చి, ఏప్రిల్, మే నెల ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల కానున్నాయి
14.స్టీల్ ప్లాంట్ లో ద్రవపు ఉక్కు నేలపాలు
విశాఖ ఉక్కు కర్మాగారంలో ద్రవపు ఉక్కు నేల పాలయ్యింది.అయితే ఎంత నష్టం జరిగింది అనేది తెలియలేదు
15.వివేకా ను వైఎస్ కుటుంబమే హత్య చేసింది : తులసిరెడ్డి
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ప్రజల తీర్పు స్పష్టం అయ్యింది అని, న్యాయస్థానాల తీర్పు మాత్రమే వెలువడాల్సి ఉందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు
16.దేవదాయ శాఖకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్
దేవాదాయ, ధర్మాదాయ శాఖ విజయవాడ కేంద్రంలో ఒక క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
17.ఉద్యోగుల సమస్యలపై 26న రాష్ట్ర సదస్సు : ఏపీ జేఏసీ
ఉద్యోగుల సమస్యలపై ఎన్ జెఏసి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడ లోని ఎంబీ పీవీ కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ సెక్రెటరీ జనరల్ హృదయ రాజు తెలిపారు
18.బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది
ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు
19.లా నేస్తం నిధుల విడుదల
ఏపీ సీఎం జగన్ బుధవారం వైయస్సార్ లా నేస్తం నిధులను విడుదల చేశారు
20.ఏపీకి రానున్న కొత్త గవర్నర్
ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఏపీకి కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు.24వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు
.