చెన్నై ఖాతాలో మరో విజయం... వింటేజ్ ధోని కనిపించాడు గా...

ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్( Chennai Super Kings Mumbai Indians ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై టీమ్ భారీ విజయాన్ని అందుకుంది.

తనదైన రీతిలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

ఇక ముంబై ఇండియన్స్ టీమ్ ఈమ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లకు 206 పరుగులు చేసింది.ఇక చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ టీం ని కట్టడి చేసి ఒక ఒక భారీ విక్టరీ కొట్టింది.

ఇక దీంతో అప్పటి వరకు ఆరు మ్యాచ్ ల్లో ఆడిన చెన్నై నాలుగు మ్యాచ్ ల్లో విజయాలను సాధించి టాప్ రేస్ లో.ముందుకు దూసుకెళ్తుంది.

ఇక ఈ మ్యాచ్ లో ముంబై టీమ్ మరొకసారి ఓటమిని చవి చూడాల్సిన అవసరమైతే వచ్చింది.ఇక ఇప్పటికి రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ముంబై ఇండియన్స్ మూడో మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తుందనుకుంటే ఈ మ్యాచ్ లో ఓడిపోవాల్సి వచ్చింది.చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో రూతురాజ్ గైక్వాడ్, శివం దూబే ( Ruthuraj Gaikwad, Shivam Dubey )ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు.

Advertisement

దాంతో చెన్నై 206 భారీ పరుగులు అయితే చేయగలిగింది.ఇక చివరిలో ధోని కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఒకప్పుడు వింటేజ్ ధోని ( Vintage Dhoni )ఎలాగైతే ఉండేవాడో ఈ మ్యాచ్ లో ధోని మనకు అలా కనిపించాడు.

ముఖ్యంగా చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన మూడు బంతులను ధోని సిక్స్ లుగా మలిచాడు.ఇక దాంతో స్టేడియం అంతా మహేంద్ర సింగ్ ధోని జపం చేశారు.

ఇక ముంబై టీమ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ వాళ్ళు విజయం సాధించలేకపోయారు.ఇక మతిషా పతిరానా తన బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు.ఇక ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ టీమ్ ను కోలుకోవాలేని దెబ్బ కొట్టాడు.

ఇక మతిశ పాతిరానా నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఫోకస్ చేసిన అకీరా... ఆత్రుతగా ఉందంటూ?
Advertisement

తాజా వార్తలు