తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రానికి మరో భారీ ఇన్వెస్టిమెంట్ వచ్చింది.
అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.సదరు కంపెనీ రూ.600 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని తెలిపారు.ఈ పెట్టుబడి ద్వారా సుమారు 3 వందల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.అదేవిధంగా పరోక్షంగా చాలా మంది ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.