భారత ఆర్ధిక మాంధ్యంలొ భారీ మార్పులు రాబోతున్నాయా? ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం లోని కరెన్పీ రూపాయి విలువ చాలా తక్కువనేది జగమెరిగిన నగ్న సత్యం.అంతుకు కారణాలు కూడా లేకపోలేదు.
ప్రస్తుతం మనదేశం ఈ వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన సరళీకృత విధానం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ విధానాన్ని అమలు చేయడానికి దాదాపు గత పది సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
కాని ఆయా భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక పరిమితులు అందుకు అడ్డు రావడంతో ఈ విధానం ఎక్కడ వేసిన గొంగళి లా అక్కడే ఉందనేది వాస్తం.ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తుంది.
అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఎక్కువగా ఉపయోగించే కరెన్సీగా డాలర్ చలామణి అవుతుంది.దాని కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత కరెన్సీ అధికంగా ఉపయోగించాల్సి వస్తుంది.
మరో మాటగా చెప్పాలంటే అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి వ్యాపార లావాదేవీలు, పెట్టుబడి కార్యకలాపాల లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది.దాంతో భారత్ రావాలసిన అనేక లాభాలు సగానికి సగం తగ్గిపోతున్నాయనేదివాస్తవం.
ఇది గ్రహించిన రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ఆలోచనను శ్రాకారం చుట్టింది.అదే డాలర్ విలువను తగ్గించి రూపాయి విలువను పెంచే ప్రక్రియ.
స్వాతంత్ర్యం తర్వాత భారత్ లో రూపాయి విలువ గోల్డ్ విలువతో పోల్చే వారు.ఇది 1960 ప్రారంభంలో తూర్పు ఐరోపాతో భారతదేశం యొక్క చెల్లింపు ఒప్పందాలలో రూపాయి ఖాతా యూనిట్ గా భావించేవారు .అంటే రూపాయి మారకం విలువ బంగారం పరంగా నిర్ణయించబడింది.1966 లో రూపాయి విలువ తగ్గింపుకు అసలు కారణమైన భంగారం నిబంధనపై దృష్టి పడింది.

అప్పటి యూఎస్ ఎస్ ఆర్ తో చెట్టా పట్టాలేసుకుని తిరిగిన భారత్ తన వాణిజ్య ఒప్పాందాలపై రష్యా ఒకింత మొహమాటపెట్టింది.రెండు దేశాలకు మధ్య ఉన్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఒప్పాందాల్లోని చెల్లింపుల నిబంధనలు ఇతర దేశాలవాణిజ్య ఒప్పందాలకు లింకు పెట్టింది.అప్పట్లో రష్యా ప్రపోజల్స్ భారత్ కు ఇష్టం లేకపోయినా, రూపాయి తగ్గింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.అప్పటి రూపాయి విలువ తగ్గేసరికి అంటే చవుకగా ఎగుమతులు, ఎక్కవ ధరకు దిగుమతులు లాంటి ప్రక్రియ చేపట్టడం అనే విధానంలో విదేశాలనుంచి అధికాలాభాలను ఆశించినట్లు భావించాలి.
భారతదేశంలో చాలా ఆందోళన కలిగించింది ఎందుకంటే విలువ తగ్గింపు సమయంలో, 1966 క్యాలెండర్ సంవత్సరంలో ప్రణాళిక చేయబడిన వాణిజ్యంలో నాలుగింట ఒక వంతు మాత్రమే సాధించబడింది.