ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి వరుస షాకులు తగులుతున్నాయి.ఇప్పటికే సంక్రాంతికి వారసుడు సినిమా తెలుగులో భారీ వసూళ్లు రాబడుతుంది అనుకోగా అది కాస్త లెక్క తప్పింది.
విజయ్ కి తెలుగులో ఫాలోయింగ్ ఉన్నా సినిమాను తెలుగులో సరిగా ప్రమోషన్స్ చేయలేదు దిల్ రాజు.కనీసం సినిమా ట్రైలర్ కూడా విజయ్ తో ట్విట్టర్ లో పెట్టించలేకపోయాడంటే అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఇలా ఉన్న దిల్ రాజుకి మరో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.ఈ సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ వారి రెండు సినిమాలను సొంతంగా రిలీజ్ చేసుకుని షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలో రాబోతున్న మహేష్ త్రివిక్రం కాంబో సినిమాను కూడా హారిక హాసిని వారు ఏసియన్ వారికి నైజాం రైట్స్ ఇచ్చేశారట.ఆ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నారు.
కానీ హారిక హాసిని వారు ముందుగానే ఏసియన్ వారితో బేరాలు కుదుర్చుకున్నారట.ఈ విధంగా కూడా దిల్ రాజుకి ఒక పెద్ద సినిమా ఆఫర్ పోయినట్టు తెలుస్తుంది.
మరి దిల్ రాజు నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది.పెద్ద ప్రొడక్షన్స్ అన్ని తనకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకుంటే ఆయన ఏం చేస్తారన్నది చూడాలి.