అందరినీ పంపించాకే ఆ సీన్లు తీశారు.. అంజలి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న హీరోయిన్లలో అంజలి( Anjali ) ఒకరు.

గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి కీలక పాత్ర పోషించగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

అంజలి నటించిన బహిష్కరణ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.బహిష్కరణ వెబ్ సిరీస్ ( Bahishkarana )లో అంజలి వేశ్య రోల్ లో నటించి ఆకట్టుకున్నారు.

ఒక ఇంటర్వ్యూకు హాజరైన అంజలి ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అంజలి మాట్లాడుతూ నాకు కెరీర్ తొలినాళ్లలో మంచి పాత్రలు వచ్చాయని నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్ లను ఎంచుకుంటానని అంజలి పేర్కొన్నారు.

కొన్ని సినిమాల కోసం నేను ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ( Martial arts )నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.యాక్షన్ సన్నివేశాలను సైతం నేను డూప్ లేకుండా చేస్తానని అంజలి వెల్లడించారు.

Advertisement

నవరస వెబ్ సిరీస్ సమయంలో క్యాస్టూమ్స్ వల్ల కొన్ని గంటల పాటు వాష్ రూమ్ కు కూడా వెళ్లలేదని ఆమె అన్నారు.

అయితే ఈ సిరీస్ లో నేను ఇంటిమేట్ సీన్లలో నటించడంతో గందరగోళానికి గురయ్యానని ఆమె తెలిపారు.అయితే ఆ సీన్లు షూట్ చేసే సమయంలో అందరినీ బయటకు పంపి షూట్ చేశారని వెల్లడించారు.నేను ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నా రోల్ కు అనుకున్న దానికంటే మంచి స్పందన వచ్చిందని అంజలి పేర్కొన్నారు.

తన పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి కూడా అంజలి తెలిపారు.నా గురించి ఎవరైనా తప్పుగా వార్తలు రాసిన సమయంలో నేను బాధ పడతానని ఆమె వెల్లడించారు.అలా వార్తలు వస్తున్నాయని చెప్పి నేను పెళ్లి చేసుకోలేను కదా అని అంజలి కామెంట్లు చేశారు.

అంజలి రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

అనంత్ అంబానీకి 40 కోట్ల విలువైన ఫ్లాట్ కానుకగా ఇచ్చిన స్టార్ హీరో?
Advertisement

తాజా వార్తలు