మారుతున్న కాలంతో పాటుగా వాతావరణంలో కాలుష్యం( Pollution ) కూడా పెరిగిపోతుంది.ముఖ్యంగా నదులు, చెరువులు చెత్తచెదారంతో నిండిపోయి అక్కడి నీరు మొత్తం కలుషితం అవుతున్నాయి.
అయితే కొన్ని చోట్ల ఆ చెత్తను శుభ్రం చేయడానికి కొన్ని రోబోలు( Robots ) ఉపయోగస్తున్నారు.అలాంటి రోబోకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక రోబోటిక్ యంత్రం నదిలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను లాగి దానిలో అమర్చిన ఒక బాక్స్ లోకి తీసుకుంటుంది.
అలా చెత్త మొత్తం ఆ రోబోటిక్ యంత్రం శుభ్రం చెయ్యడంతో నది పరిశుభ్రంగా కనపడుతుంది.ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షించింది.దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘ఈ ఆటోమేటిక్ రోబో మెషిన్ నదిలో చెత్తను భలే శుభ్రం చేస్తుంది.
ఈ రోబో యంత్రాన్ని చైనాలో తయారు చేసినట్లున్నారు, ఇలాంటివి మన దేశానికి కూడా చాలా అవసరం.వీటిని ఇండియన్స్ కూడా తయారు చేయాలని కోరుకుంటున్నా.’ అంటూ రాసుకొచ్చారు.
ఇలాంటి రోబోలను తయారుచేస్తున్న, తయారు చేసేందుకు కృషి చేస్తున్న సాఫ్ట్వేర్ రంగాలకు తాను అండగా ఉంటానని కూడా ఆయన చెప్పాడు.అంతేకాదు పెట్టుబడి పెట్టి మరీ ప్రోత్సహిస్తానని అన్నాడు.ఆ రోబో యంత్రాలకు సంబంధించిన వివరాలను వివరిస్తే పెట్టుబడి పెట్టేందుకు రెడీ అని బహిరంగంగా ప్రకటించారు.
ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.అలానే వివిధ రంగాల్లో ప్రతిభవంతులైన వారికి ప్రోత్సాహం కలిగిస్తూ అండగా ఉంటారు.
ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన క్లీనింగ్ రోబో( Cleaning Robot ) వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ 11 మిలియన్ వ్యూస్ ని దాటిపోయింది.