అమరావతి రాజధాని, విభజన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం పిటిషన్ లో కోరింది.అయితే అమరావతి, విభజన పిటిషన్లను విడిగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.