మన టాలీవుడ్ లో పెద్ద కుటుంబాలు చాలానే ఉన్నాయి.అందులో అన్ని కుటుంబాలు ఒకప్పుడు స్టూడియోలు ఏర్పాటు చేసారు.
అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను, దగ్గుబాటి కుటుంబానికి రామానాయుడు స్టూడియో, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి పద్మాలయ స్టూడియో, ఎన్టీఆర్ ఫ్యామిలీకి రామకృష్ణ హార్టీకల్చరల్ స్టూడియోలు ఉన్న విషయం తెలిసిందే.
చెన్నై నుండి సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన స్టూడియోలు ఇవి.అయితే ఇందులో ప్రెజెంట్ రెండు స్టూడియోలు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి.అన్నపూర్ణ స్టూడియో టాప్ లో ఉండగా.
రామానాయుడు స్టూడియో ఆ తర్వాత స్థానంలో నిలిచింది.అయితే తెలుగులో పెద్ద ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీకి మాత్రం ఇంత వరకు స్టూడియో లేదు.
మెగా స్టార్ కు ఆ ఆలోచన కూడా ఉన్నట్టు బయటకు రాలేదు.
అయితే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు ఫ్యామిలీ మాత్రం ఇప్పుడు కొత్త స్టూడియోను నిర్మించింది.
”అల్లు స్టూడియోస్” పేరుతో ఆధునిక వసతులతో సర్వాంగ సుందరంగా అన్ని హంగులను కలగలిపి వెబ్ సిరీస్ లకు, రియాలిటీ షోలకు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు అనువుగా ఉండేలా ఈ స్టూడియోను అల్లు ఫ్యామిలీ అందుబాటులోకి తీసుకొస్తుంది.
ఈ స్టూడియో ఓపెనింగ్ అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఓపెనింగ్ చేయబోతున్నారు.ఈ ఓపెనింగ్ కు అల్లు ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.అల్లు అరవింద్ కుమారులు అయినా అల్లు వెంకట్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు ఈ స్టూడియోలో భాగస్వాములు.
మరి తాజా సమాచారం ప్రకారం ఈ స్టూడియోలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మొదటగా ప్రారంభం కాబోతుంది అని తెలుస్తుంది.