సుప్రీం కోసం మెగా కలయిక

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ‘పటాస్‌’ ఫేం అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుప్రీం’.ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

సాయి ధరమ్‌ తేజ్‌కు జోడీగా ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా టైటిల్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.

అంచనాలకు తగ్గట్లుగా సినిమాను దర్శకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మరో మెగా హీరో అల్లు శిరీష్‌ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో అల్లు శిరీష్‌ ఒక ముఖ్య గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.గతంలో ‘ఎవడు’ సినిమాలో రామ్‌చరణ్‌ మరియు అల్లు అర్జున్‌లు కలిసి నటించిన విషయం తెల్సిందే.

Advertisement

మళ్లీ ఇప్పుడు వీరిద్దరు కలిసి నటించబోతున్నారు.మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రంతో భారీ సక్సెస్‌ను అందుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ మరోసారి ఈ సినిమాతో సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.మెగా హీరోల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు