అల్లు అర్జున్.సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
పుష్ప సినిమా 2021 డిసెంబర్ లో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.అందుకే అప్పటి నుండి కూడా పుష్ప 2 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం 2022 డిసెంబర్ లోనే విడుదల అవ్వాల్సి ఉంది.కానీ అప్పటికి షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు.
ఆ మధ్య 2023 డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని భావించారు.కానీ అది కూడా సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఆ తర్వాత 2024 సంక్రాంతిపై సుకుమార్ దృష్టి పెట్టాడు అంటూ పుకార్లు వచ్చాయి.కానీ అది కూడా నిజం కాదని తెలుస్తోంది.
తాజాగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 2024 సంవత్సరం సమ్మర్ లో పుష్ప 2 సినిమాను విడుదల చేయబోతున్నారట.
సమ్మర్ లో ఒక మంచి తేదీని చూసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.పుష్ప సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు చేసిన నేపథ్యంలో పుష్ప 2 సినిమాను దాదాపుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.అందుకే పుష్ప 2 కనీసం 500 కోట్ల వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉంది.
అందుకే కాస్త జాగ్రత్తగా సినిమాను రూపొందించడంతో పాటు పోటీ లేని సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.పుష్ప సినిమా కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ పుష్ప 2 కి వస్తే దేశ వ్యాప్తంగా భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.కీలక పాత్రలో ఫాహద్ ఫాసిల్ నటిస్తున్నాడు.అంతే కాకుండా సునీల్ మరియు అనసూయ కనిపించబోతున్నారు.