అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ ( Trivikram )మరో కొత్త సినిమాను ప్రకటించాడు.ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం( gunturkaram ) చేస్తున్నాడు.
ఇప్పటికే దాదాపు 30 శాతం షూట్ పూర్తి చేసుకుంది.ఇది ఇలా ఉండగానే త్రివిక్రమ్ మరో కొత్త మూవీ ప్రకటించారు.
గత కొద్దీ రోజులుగా ఈయన అల్లు అర్జున్ ( Allu Arjun )తో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.
మరి అనుకున్నట్టుగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో నాల్గవ సినిమా ప్రకటించాడు.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు మూడు కూడా మంచి హిట్ అయ్యాయి.
ఇక హ్యాట్రిక్స్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న తర్వాత మరోసారి ఈ కాంబో కలిసి పని చేయబోతుంది.
ఈ రోజు ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అప్డేట్ వచ్చింది.తమ నాల్గవ సినిమాను ఈ రోజు మేకర్స్ యూట్యూబ్ లో అనౌన్స్ మెంట్ వీడియోతో రిలీజ్ చేసారు.టైటిల్ అండ్ మిగితా వివరాలు త్వరలో చెబుతామని చెప్పుకొచ్చారు.
కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్( Geeta Arts ) తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్నా సంగీతం అందించనున్నాడు.
ఈసారి ఈ క్రేజీ కాంబో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చేయనున్నట్టు టాక్.ఇందుకోసం త్రివిక్రమ్ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసారని వార్తలు వస్తున్నాయి.ఈ కాంబోపై అంచనాలు అప్పుడే పీక్స్ కు వెళ్లిపోయాయి.
మరి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నాడు.ఇది కూడా సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.
అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు.ఈ ఇద్దరి ప్రాజెక్టులు పూర్తి అయితే కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.