సరిలేరు నీకెవ్వరును అల వైకుంఠపురములో అడుకుంటున్నారుగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతోంది.పోటీలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒకరోజు ముందుగానే ల్యాండ్ అయినా త్రివిక్రమ్ అండతో మహేష్‌కు చుక్కలు చూపిస్తున్నాడు బన్నీ.

తాజాగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసినట్లు చిత్ర నిర్మాత అనిల్ సుంకరతో పాటు హీరో మహేష్ కూడా చెప్పిన విషయం తెలిసిందే.కాగా వారికి కౌంటర్ ఇస్తూ బన్నీ అండ్ టీమ్ కూడా తమ చిత్రం కేవలం 6 రోజుల్లోనే రూ.104 కోట్లతో నాన్ బాహుబలి రికార్డు సృష్టించిందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.దీంతో సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్‌ గూబ గుయ్యిమంది.

ఫేక్ కలెక్షన్స్‌తో ప్రేక్షకులను అయోమయంలో పడేసే స్టార్ హీరోలకు ఇలాంటి కౌంటర్‌లే సరైనవి అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా, తమవి ఫేక్ కావు రియల్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.ఏదేమైనా ఫ్యాన్ వార్‌ను క్రియేట్ చేసేందుకే ఇలాంటి కలెక్షన్లతో ఫీట్లు చేస్తున్నారంటూ సినీ క్రిటిక్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

తాజా వార్తలు