యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ప్రకటించడమే కాకుండా సినిమా షూట్ కూడా పూర్తి చేస్తున్నాడు.
అయితే శరవేగంగా పూర్తి అవుతున్న సమయంలో కరోనా ఈ సినిమాకు అడ్డంకిగా మారింది.ఇక అప్పటి నుండి షూట్ స్లో అయిపొయింది.
ఏజెంట్ సినిమాను ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసాడో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ కు నోచుకోవడం లేదు.ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఏజెంట్ సినిమాను సురేందర్ రెడ్డి కొన్నాళ్లుగా చిక్కుతునే ఉన్నాడు.
మరి ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్లకు పైగానే సమయం కేటాయిస్తూ వస్తున్నాడు.అయినా కూడా ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు.ఇక అఖిల్ సినిమా గురించి ఇప్పుడు చర్చకు వచ్చింది.
అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు.దీంతో నెక్స్ట్ సినిమా ప్రశ్నర్ధకంగా మారిపోయింది.
ఏజెంట్ కనుక సూపర్ హిట్ అయితే అఖిల్ రేంజ్ మారిపోవచ్చు.ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇక ప్రెజెంట్ నాగ్ కూడా అఖిల్ సినిమాల విషయంలో జోక్యం చేసుకోవడం లేదని ఈయనే స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని టాక్.
చూడాలి అఖిల్ నెక్స్ట్ ఎవరికీ ఓకే చెబుతాడో.