నందమూరి వారసుడు, దివంగత నటుడు తారకరత్న ( Tarakaratn a) మరణం ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) తన భర్త మరణం నుంచి ఇంకా బయటపడలేదని చెప్పాలి.
ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన భర్తకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉంటారు.
ఇక తారకరత్న అలేఖ్య ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవడంతో నందమూరి కుటుంబ ( Nandamuri Family ) సభ్యులు వీరిని ఇంటికి దూరం చేశారు.
ఇలా కుటుంబానికి దూరంగా భార్య పిల్లలతో ఉంటున్నటువంటి ఈయన ఎప్పటికైనా తన కుటుంబంలో కలుస్తానని ఆశపడ్డారు కానీ ఆ కోరిక నెరవేరకుండా మరణించారు.ఇక తారకరత్న మరణించిన తర్వాత అలేఖ్య రెడ్డి తన పిల్లలతో ఒంటరిగా ఉంటున్నప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం వీరిని చేరదీయలేదు.తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ అంత్యక్రియల సమయంలో మాత్రమే వచ్చారు.
ఆ సమయంలో కూడా తన కోడలిని హక్కున చేర్చుకొని ఓదార్చలేదు.ఇలా కొడుకు మరణించినప్పటికీ కోడలిని పిల్లలని కూడా దూరం పెట్టడంతో తాజాగా ఒక నేటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ ఎప్పటికైనా మీరు ఆ కుటుంబంతో కలుస్తారని నమ్మకం ఇంకా ఉందా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అలేఖ్య రెడ్డి సమాధానం చెబుతూ.ఆశ .నమ్మకం ఈ రెండు మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తాయని తెలిపారు.నేను తారకరత్న ఎన్ని రోజులు ఇదే నమ్మకంతో ముందుకు సాగాము.
ఏదో ఒక రోజు మా ఈ నమ్మకం నెరవేరుతుందని, పిల్లలకు ఒక కుటుంబం ఉంటుంది అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఎప్పటికైనా తనని నందమూరి కుటుంబం చేరదీస్తుందన్న ఆకాంక్షతోనే ఈమె ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది.
మరి తారకరత్న ఫ్యామిలీ ఈమెను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy