వెంబడించి లారీని పట్టుకున్న పోలీసులు...రేషన్ బియ్యం తరలిస్తున్న వైనం

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ( DSP Rajasekhar Raju )ఆదేశాల మేరకు రూరల్ సీఐ కె.వీరబాబు పర్యవేక్షణలో శుక్రవారం 12 గంటల సమయంలో వాడపల్లి ఎస్‌ఐ ఇ.

 The Police Chased The Lorry And Caught It... It Was Transporting Ration Rice ,p-TeluguStop.com

రవి తన సిబ్బందితో కలసి నల్లగొండ జిల్లా దామరచర్ల గ్రామ శివారులోని జాన్ పహాడ్ వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.ఆ సమయంలో సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ వైపు నుండ్ ఏపీ వైపుకు ఏపీ 24వై 6788 నెంబర్ గల లారీ వెళుతుండగా ఆపేందుకు ప్రయత్నం చేయగా ఆపకుండా వేగంగా వెళ్ళడంతో దానిని వెంబడించి కృష్ణానది బ్రిడ్జ్ దగ్గరలో పట్టుబడి చేసి తనిఖీ చేయగా సుమారు 22 టన్నుల పిడిఎస్ రైస్ గుర్తించారు.

లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాను ఏపీకి చెందిన కొంతమంది తో కలసి పిడిఎస్ రైస్ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు అంగీకరించడంతో లోడు లారీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు శనివారం వాడపల్లి ఇ.రవి తెలిపారు.వెంబడించి అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులను డిఎస్పీ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube