కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay Joseph ) ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో” సినిమా( Leo movie ) చేస్తున్నాడు.ఈ సినిమా షూట్ ”వారిసు” రిలీజ్ కాగానే స్టార్ట్ చేయగా ఇప్పటికే 80 శాతానికి పైగానే పూర్తి చేసారు.
అందుకే అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 68వ సినిమాను విజయ్ కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో చేయనున్నాడు అని ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.అధికారిక ప్రకటన అలా వచ్చిందో లేదో ఈ సినిమా నుండి ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తుంది.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య విలన్ రోల్ లో నటిస్తున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ను కాకుండా సీనియర్ హీరోయిన్ ను తీసుకోనున్నారు అని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.కోలీవుడ్ మీడియా చెబుతున్న ప్రకారం.
ఈ సినిమాలో విజయ్ సరసన ఖుషి హీరోయిన్ నటిస్తున్నట్టు టాక్.ఖుషి హీరోయిన్ అంటే భూమిక కానీ సమంత కానీ అనుకుంటున్నారా.
అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.ఈ సినిమాలో తమిళ్ లో ఖుషి సినిమా రీమేక్ లో నటించిన విజయ్ – జ్యోతిక జంట అక్కడ బాగా ఫేమస్ అయ్యారు.
మరి ఇప్పుడు ఆ ఖుషి భామ జ్యోతిక హీరోయిన్( Jyotika is the heroine ) గా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు.ఇదే నిజమైతే ఈ అమ్మడికి ఇది పెద్ద ఆఫర్ అనే తెలుస్తుంది.మరి ఈ ఖుషి జంట చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించ బోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరిన్ని అధికం అవుతున్నాయి.