ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM YS Jagan ) ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నల్లపాడు చేరుకుంటారు, అక్కడ లయోలా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో తొలిసారిగా గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు.
క్రికెట్ | వాలీబాల్ | కబడ్డీ | ఖోఖో | బ్యాడ్మింటన్ డబుల్స్ లలో*గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో క్రీడా సంబరాలు.గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూ( Loyola Public School )ల్ లో లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.
టోర్నమెంట్ తేదీలు
26 డిసెంబర్, 2023 నుండి 10 ఫిబ్రవరి, 2024 వరకు 47 రోజులపాటు.గ్రామ/వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు.
రిజిస్ట్రేషన్లు
క్రీడాకారులు : 34.19 లక్షలు,ప్రేక్షకులు : 88.66 లక్షలు ,మొత్తం : 122.85 లక్షలు
కార్యక్రమ లక్ష్యాలు
క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం.ప్రతిభను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను కనుగొని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం.• క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం.
ప్రైజ్ మనీ:
నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో,బహుమతుల ప్రదానం.రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు, మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనండి.