గ్రూప్ -2 పరీక్ష వాయిదాపై హైకోర్టు విచారణ వాయిదా

తెలంగాణలో గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం టీఎస్పీఎస్సీకి కీలక ఆదేశాలు ఇచ్చింది.

గ్రూప్-2 పరీక్షపై ఏ నిర్ణయం తీసుకుంటారో సోమవారం లోపు చెప్పాలని టీఎస్పీఎస్సీకి కోర్టు సూచించింది.ఈ క్రమంలో హడావుడిగా ఒకే నెలలో పరీక్షలు నిర్వహిస్తున్నారని అభ్యర్థుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ఆరు నెలల ముందే వచ్చిందన్న టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది కావాలనే పరీక్షను వాయిదా వేయించే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్పీ తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించాలన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు