రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్( Adipurush )”.ఈ సినిమా పాన్ ఇండియన్ మార్కెట్ దగ్గర ప్రస్తుతం భారీ హైప్ తెచ్చుకుంది.
ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.దాదాపు 1000 కోట్ల వసూళ్ల సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ ను డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) రాముడి పాత్రలో నటించగా.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.
వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం టీమ్ అంతా వరుస ఈవెంట్స్ అండ్ అప్డేట్ లను అందించడం కోసం బిజీ బిజీగా ఉంది.ఇక అతి త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడానికి భారీ ఏర్పాట్లు చేయబోతున్నారు మేకర్స్.
ఇంత బిజీగా ఉన్న తాజాగా ఆడియెన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ అందించారు.ఈ సినిమా ఎంత హాట్ టాపిక్ గా ఆడియెన్స్ లో చర్చకు వచ్చిందో చెబుతున్నారు.యూట్యూబ్ లో గత మూడు నెలల నుండి ఆదిపురుష్ కోసం ఆడియెన్స్ బాగా సెర్చ్ చేశారట.90 రోజుల్లో అత్యధికంగా వెతికిన టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఆదిపురుష్ అని తెలుస్తుంది.మరి ఈ అవైటెడ్ సినిమా జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏ రేంజ్ లో హిట్ అయ్యి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.