అదాశర్మ ముఖ్య పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా మొదటి 10 రోజుల్ల దాదాపుగా 140 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ది కేరళ స్టోరీ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది.దాదాపుగా 128 కోట్ల రూపాయలతో ఆలియా భట్ సినిమా గంగూభాయ్ సినిమా నెం.1 గా ఉండేది.ఇప్పుడు ఆ నెం.1 స్థానం ది కేరళ స్టోరీకి దక్కింది.వివాదం వల్ల ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు దక్కింది.ముందు ముందు భారీ వసూళ్లు సాధిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా కనీసం 50 రోజులు పూర్తి అయ్యే వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసే ఉద్దేశ్యం లేదట.అప్పటి వరకు భారీ గా వసూళ్లు నమోదు అయితే ఇంకా కూడా థియేటర్ లోనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓటీటీ ది కేరళ స్టోరీ ఎంట్రీ గురించి చర్చిస్తున్నారు.జూన్ నెల తర్వాతే సినిమాను ఓటీటీ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.రూ.250 కోట్ల వసూళ్లు ఈ సినిమా టార్గెట్ గా తెలుస్తోంది.మరో వంద కోట్ల వసూళ్లు నమోదు అయితే అరుదైన ఘనత దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
అందుకే అప్పటి వరకు ఈ సినిమా ను థియేటర్ లోనే ఉంచే అవకాశాలు ఉన్నాయి.వివాదాలు అవుతా ఉంటే సినిమా క్రేజ్ పెరుగుతూనే ఉంది.ఇటీవల హీరోయిన్ అదా శర్మ మరియు ఇతర యూనిట్ సభ్యులను చంపేస్తామంటూ కొందరు దుండగులు హెచ్చరించారు.ఆ వెంటనే యాక్సిడెంట్ జరిగింది.
దాంతో వివాదం మరింత జరిగింది.సినిమా వసూళ్లు మరిన్ని రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.