Sheep Scam : గొర్రెల స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం..!

తెలంగాణలోని గొర్రెల కుంభకోణం కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది.కాంట్రాక్టర్ మోహియుద్దీన్,( Contractor Mohiuddin ) పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయిలను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

 Acb Speed Up Investigation In Sheep Scam Case-TeluguStop.com

కాగా 120 యూనిట్ల గొర్రెలను కాంట్రాక్టర్ ఏపీకి చెందిన రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారని తెలుస్తోంది.అయితే రూ.2.10 కోట్లు రైతులకు చెల్లించకుండా కాంట్రాక్టర్ బినామీ ఖాతాలోకి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో కాంట్రాక్టర్ కు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు సహకరించారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం.అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతోనే గొర్రెలు కొన్నారని రైతులు ఆరోపిస్తున్నారు.మరోవైపు గొర్రెల కుంభకోణంలో భారీగా అవినీతి జరిగిందని ఇప్పటికే కాగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తలసానితో పాటు ఓఎస్డీ కల్యాణ్ పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube