టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది.ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు డీఈ రమేశ్ మొత్తం 80 మందికి ఏఈ పేపర్ ను విక్రయించినట్లు గుర్తించారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఒక్కొక్కరి దగ్గర రూ.30 లక్షలకు డీఈ రమేశ్ బేరం కుదుర్చుకున్నాడని సమాచారం.పూల సురేశ్ నుంచి ఏఈ పేపర్ ను తీసుకొచ్చిన డీఈ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అభ్యర్థులకు పేపర్ విక్రయించాడని అధికారులు తెలిపారు.అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధుల పిల్లలకు కూడా పేపర్ అమ్మినట్లు నిర్ధారించారు.
మరోవైపు డీఈ రమేశ్ ను కోర్టు మొత్తం ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది.