బాపట్ల జిల్లా చీరాలలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి.చీరాలలో జనసేన తరపున ఆమంచి స్వాములు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా ప్రస్తుతం కరణం బలరాం కుమారుడు చీరాల వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న విషయం తెలిసిందే.చీరాలలో కరణం, ఆమంచి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమంచి స్వాములు జనసేన నుంచి పోటీపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.