హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రేపు కీలక సమావేశం జరగనుంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు భేటీ కానున్నారని తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు, కోఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.అదేవిధంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వార్ రూమ్ ఇంఛార్జ్ రోహన్ గుప్తా సలహాలు, సూచనలు చేయనున్నారు.