జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది.ముకునూరు, కిష్టాపురం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.
రాత్రి సమయంలో రోడ్డుపై పులి కనిపించడంతో పాటు ఓ ఎద్దుపై దాడికి పాల్పడింది.దీంతో పరిసర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు పులి కోసం గాలిస్తున్నారు.