జపాన్( Japan ) లో భారీ భూకంపం సంభవించింది.సెంట్రల్ జపాన్ లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు అయిందని అధికారులు వెల్లడించారు.భూకంపంతో జపాన్ కోస్తా తీర ప్రాంతానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు ఇషీకావ( Ishikawa ), నిగాట, టొయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికాలు జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ క్రమంలోనే తీర ప్రాంత ప్రజలు తక్షణం ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఐదు మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.కాగా జపాన్ లోని క్యాంటో, టోక్యో( Tokyo ) ప్రాంతాలపై భూకంప ప్రభావం ఉండగా.
న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను జపాన్ ప్రభుత్వం పటిష్టం చేసింది.







