నిన్న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఏకంగా 7 సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు డైరెక్ట్ చిత్రాలు కూడా వచ్చాయి.
ఈ చిత్రాల్లో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు ‘సావిత్రి’ మరియు ‘ఎటాక్’.ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.
నారా రోహిత్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘సావిత్రి’ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలను కలిపించింది.అయితే తీరా సినిమా మ్యాటర్ లేకుండానే వచ్చేసింది.
వర్మ ఎటాక్ కూడా పరమ రొటీన్ క్రైమ్ చిత్రాల మాదిరిగానే ఉంది.
అంచనాలున్న ‘సావిత్రి’, ‘ఎటాక్’ చిత్రాలు ఫ్లాప్ అవ్వగా మిగిలిన చిత్రాల్లో కూడా ఏ ఒక్కటి ఆకట్టుకోలేక పోయ్యాయి.
‘అప్పుడలా ఇప్పుడిలా’, ‘నన్ను వదిలి నీవుపోలేవులే’, ‘7 టు 4’ చిత్రాలు కూడా ప్రేక్షకుల దృష్టిని అయితే ఆకర్షించాయి, కాని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.ఈవారం వచ్చిన ఏ ఒక్క చిత్రం కూడా మెప్పించక పోవడంతో గత వారం వచ్చిన ‘ఊపిరి’ చిత్రం ఈ వారం కూడా కలెక్షన్స్ను కొనసాగించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
మరి కొన్ని రోజుల్లో సర్దార్ గబ్బర్సింగ్ చిత్రం రాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా ముందు ఇవన్నీ కూడా కొట్టుకు పోనున్నాయి.