వృత్తి నిబద్ధత అనేది అతి తక్కువ మందిలో ఉంటుంది.అలాంటేవారే ఎప్పటికప్పుడు తమని తాము మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతారు.
అలాంటి అతితక్కువ మందిలో నేనూ ఒకడ్ని అని నిరూపించుకున్నాడు దేవిశ్రీప్రసాద్.
దేవిశ్రీ నాన్న సత్యమూర్తి గారు దేహాన్ని విడిచి వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఆ బాధలో దేవిశ్రీ ఉండగా, మరోవైపు నాన్నకు ప్రేమతోకి సంబంధించి చివరి పాటతో పాటు రీ-రికార్డింగ్ బ్యాలెన్స్ గా ఉండిపోయింది.సినిమా జనవరి 13 న వస్తుందని చెప్పేసారు, సమయానికి రాకపోతే చాలా నష్టం జరుగుతుంది.
కాని ఎన్టీఆర్ దేవిశ్రీతో ఇప్పుడిప్పుడే నాన్నకు ప్రేమతో గురించి ఆలోచించవద్దని, ఈ సమయంలో కుటుంబంతో సమయాన్ని గడపాలని సర్ది చెప్పాడు.కాని తన వల్ల నష్టం రాకుడదని భావించిన దేవిశ్రీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ కి ఫోన్ చేసి ” నేను మిగిలున్న పాటని పూర్తి చేస్తున్నాను.మనం అనౌన్స్ చేసిన తేదికే సినిమా విడుదల చేద్దాం.
నా వల్ల అయితే ఎలాంటి ఆలస్యం జరగదు ” అని మాటిచ్చాడట.
ఇంత దుఃఖంలో కూడా పనిచేయడం కళను ప్రేమించేవారికే సాధ్యం.
హ్యాట్సాఫ్ దేవిశ్రీప్రసాద్.







