దిల్‌రాజు ఎంట్రీతో సినిమా సీన్‌ మారిపోయింది

షార్ట్‌ ఫిల్మ్స్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌ తరుణ్‌ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండి తెరపై హీరోగా మెరిశాడు.

అదే సినిమాలో బుల్లి తెర ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అవికా గౌర్‌ హీరోయిన్‌గా నటించింది.

ఆ సినిమా చిన్న చిత్రంగా తెరకెక్కి పెద్ద సక్సెస్‌ అయ్యింది.ఆ సినిమాతో వీరిద్దరికి కూడా మంచి క్రేజ్‌ పెరిగింది.

ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సారి సినిమా రాబోతుంది.‘సినిమా చూపిస్త మావ’ టైటిల్‌తో రెడీ అయిన వీరి కాంబినేషన్‌ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దం అవుతోంది.

నిన్న మొన్నటి వరకు ఈ సినిమాను తీసుకునేందుకు పంపిణీదారులు పెద్దగా ఆసక్తిని కనబర్చింది లేదు.అయితే తాజాగా అన్ని ఏరియాల నుండి కూడా భారీ మొత్తాలకు ఈ సినిమాను కొనుగోలు చేస్తాం అంటూ ముందుకు వస్తున్నారు.

Advertisement

కారణం ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నాడు.దిల్‌రాజు జడ్జిమెంట్‌పై ఉండే నమ్మకంతో ఇతర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అలాగే ప్రేక్షకుల్లో సైతం దిల్‌రాజు ఈ సినిమాను చూపిస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.విడుదల సమయం వరకు ఈ సినిమాకు భారీ క్రేజ్‌ రావడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

ఆగస్టు 14న ఈ సినిమా విడుద అయ్యే అవకాశాున్నాయి.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు