విపక్షం లేకుండా శాసనసభ ముందుకు పోవడం భలేగా ఉంది .జగన్ లాంటి వారికి సభ సాంప్రదాయాలు తెలియనందున ఎప్పుడు తప్పుడు నిలదీతలతో సభ సాగింది .
అందుకే సభ ఈ రోజు ఎంతో హుందాగా సాగుతోంది అని మంత్రి రావెల కిషోర్ బాబు తన అభిప్రాయాన్ని సభకు తెలియపరిచారు .దీనిపై మరికొంతమంది మంత్రులు ఇదే అభిప్రాయాన్ని చెప్పిబాబు భక్తి చాటుకున్నారు.అయితే సభకు ప్రతిపక్షం వైకాపా రాకపోవడం తో ఎలాంటి నిలదీతలు లేకుండా అంతా ఏకపక్షంగానే సాగింది.అందులో ముఖ్యమంత్రినే ఎత్తి పోగుడుకుంటూ మంత్రులు సాగారు.స్పీకర్ స్పందిస్తూ ప్రతిపక్షం లేకుండా సభ నడపడం ఏమంత బావుండదు .ఏ సభ అయినా బలమైన నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటె అప్పుడు సభ రాణిస్తుంది.కనుక ప్రతిపక్షం లేకుండా సభను కోరుకోలేము అని చెప్పారు.







