మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెల్సిందే.వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
కోన వెంకట్ మరియు గోపీ మోహన్లు ఈ సినిమాకు స్క్రిప్ట్ను రాయడం జరిగింది.స్క్రిప్ట్ను రెడీ చేస్తున్న సమయంలోనే ఈ సినిమాకు ‘నా పేరే రాజు’ అనే టైటిల్ బాగుంటుందని రచయితలు అనుకున్నారు.
ఇప్పటి వరకు అదే టైటిల్ను రామ్చరణ్ తర్వాత సినిమా టైటిల్గా మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
కాని విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్ అది కాదని, ఆ టైటిల్పై చరణ్ అంత ఆసక్తి చూపడం లేదని, త్వరలోనే మరో టైటిల్ను ఫిక్స్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
కథానుసారం ఈ సినిమాకు ఒక మంచి టైటిల్ను వెదికే పనిలో ఇప్పటికే రచయితలు మరియు దర్శకుడు పడ్డట్లుగా సమాచారం అందుతోంది.సినిమా ప్రారంభానికి ముందు టైటిల్ ఫిక్స్ కాకున్నా, విడుదల సమయం వరకు ఏదో ఒకటి ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి.
ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాత దానయ్య ప్రకటించాడు.