యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేనివని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే అన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ, జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలేక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బిసిల అభ్యన్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు.మహాత్ముని ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ముందుకు నడిచిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని,1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు.1969 లో తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశ తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తు చేశారు.సామాజిక న్యాయం, క్రమశిక్షణ,దీక్ష,దృఢ సంకల్పం కలిగిన వ్వక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని,ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్,జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్,జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వాహక అధికారి శోభారాణి,జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమాధికారి యాదయ్య,జిల్లా అధికారులు,వివిధ సంఘాల నాయకులు బాబురావు, నర్సింహా,అశోక్,బంటు రామచంద్రయ్య, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.