తరలివస్తున్న వరద...ఆయకట్టు రైతుల్లో ఆనందం

సూర్యాపేట జిల్లా:ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది( Krishna River ) పరుగులు పెడుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 30న శ్రీశైలం క్రస్ట్ గేట్లను ఏపీ ప్రభుత్వం ఎత్తనున్నట్లు తెలుస్తుంది.

 The Approaching Flood...joy Among Ayakattu Farmers-TeluguStop.com

దీంతో నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం భారీగా వచ్చే అవకాశముందని ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలు చిగురించి, కళ్ళలో ఆనందం కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు.

నార్లు పోయడం,దుక్కులు దున్నడం లాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు.ఇప్పటికే బోర్లు,బావుల ఆధారంతో కొంత మంది రైతులు నాట్లు వేసే క్రమంలో ఉన్నారు.

నాగార్జునసాగర్ కి భారీగా వరద నీరు వచ్చి డ్యాం పూర్తిస్థాయిలో నిండితే, ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటితో మెట్ట పొలాలు సైతం పూర్తి స్థాయిలో వరిసాగు చేసే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube