అంబేద్కర్ వల్లనే బడుగుల జీవితాల్లో వెలుగులు: ఎమ్మేల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా:అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి చెందుతున్నారని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.

 Ambedkar Is The Reason For The Light In The Lives Of The Badugus Mmelye Vemula V-TeluguStop.com

ఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రాజ్యాంగం నిర్మాణం చేశారని, ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు.అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అంబేద్కర్ సాక్షిగా ఈ గ్రామంలో స్వయంగా పర్యటించి,నిరుపేదలను గుర్తించి,ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోగు పద్మ,పార్టీ నాయకులు సత్తయ్య యాదవ్,రామన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ పి.మల్లయ్య, మాజీ సర్పంచ్,రాష్ట్ర గ్రంథాలయ మాజీ చైర్మన్ జెల్లా మార్కండేయ,మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube